బిగ్ బాస్ విజేత ఎవరో తెలిసిపోయింది..

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 కు విజేత ఎవరవుతారో అనే ఉత్కంఠకు ఈరోజు తో తెరపడనుంది..గత సీజన్ కు శివబాలాజీ విజేతగా నిలువగా, ఈ రెండో సీజన్ విజేత కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ప్రేక్షకులకే విజేత ను ఎన్నుకోవాల్సిన అవకాశం ఇవ్వడం తో టైటిల్ విజేత ఎవరో ముందే తెలిసిపోయింది. ముందునుండి అనుకున్నట్లే కౌశల్ సీజన్ 2 కు విజేత అయ్యారు.

గీతా మాధురి, దీప్తి పోటీ ఇచ్చినా.. కౌశల్‌కు భారీ స్థాయిలో ఓట్లు పడడంతో బిగ్ బాస్ కౌశల్ ను విజేత గా ప్రకటించినట్లు తెలుస్తుంది. ఇండియాలో జరిగిన బిగ్ బాస్ షోలలో ఎవరికీ రానన్ని ఓట్లు కౌశల్‌కు వచ్చాయట. తుది పోరులో నిలిచిన కంటెస్టంట్లకు వచ్చిన ఓట్లలో సగం ఓట్లు అతడి ఖాతాలోనే పడ్డాయని తెలుస్తోంది. టోటల్‌గా 27 కోట్ల ఓట్లు వస్తే.. 12.5 కోట్లకుపైగా ఓట్లు కౌశల్‌కే వచ్చాయని తెలుస్తోంది.

ఇప్పటికే దానికి సంబందించిన పిక్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. కౌశల్ ఆర్మీ తమ అభిమాన వ్యక్తి విజేత అయ్యాడని తెగ సంబరాలు చేసుకుంటున్నారు.