రెండో వన్డేలో భారత్ ఘన విజయం

2nd ODI India beat Englandరెండో వన్డేలో ఇంగ్లండ్‌పై 127 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించి గెలుపొందింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఆరు వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. 286  పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ పది వికెట్లు కోల్పోయి  36 ఓవర్లలో కేవలం 158 పరుగులు చేసింది. తొలి వన్డేలో ఇంగ్లండ్ గెలుపొందిన విషయం తెలిసిందే. భారత్ స్కోర్ వివరాలు చూస్తే రహానే 4, గంభీర్ 8, కోహ్లీ 37, యువరాజ్‌సింగ్ 32, రైనా 55, ధోనీ 72, జడేజా 61(నాటౌట్) పరుగులు చేశారు. ఫిన్, డెర్న్‌బాక్ చెరో రెండు, వోక్స్, ట్రేడ్‌వెల్ తలో ఒక వికెట్ తీసుకున్నారు. ఇంగ్లండ్ స్కోర్ వివరాలు చూస్తే  కుక్ 17, బెల్ 1, పీటర్సన్ 42, రూట్ 36, కీస్వెట్టర్ 18, పటేల్ 30 పరుగులు చేశారు. కుమార్, ఆశ్విన్ చెరో మూడు, జడేజా 2, అహ్మద్ ఒక వికెట్ తీసుకున్నారు.