హైదరాబాదీకి రెండో ర్యాంక్

saina nehwalభారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కెరీర్లో అత్యుత్తమంగా రెండో ర్యాంకు సాధించింది. మరో యువ క్రీడాకారుడు పారుపల్లి కశ్వప్ కూడా కెరీర్ లో అత్యుత్తమంగా పదో ర్యాంకును దక్కించుకున్నాడు. వీరిద్దరూ హైదరాబాద్ కే చెందిన క్రీడాకారులు కావడం గమనార్హం. మరోమైపు మలేసియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 23వ ర్యాంకర్ పుయ్ యిన్ యిప్ (హాంకాంగ్) పై 21-12, 21-9తో గెలిచింది. టాప్ సీడ్గా బరిలోకి దిగిన సైనా నెహ్వాల్ తొలి మ్యాచ్లో ప్రపంచ 18వ ర్యాంకర్ గువాన్ జూ (సింగపూర్)పై 21-12, 21-15తో గెలిచింది.