టీం-ఇండియాకు ’బిగ్ టెస్ట్’!!

indiaన్యూజిలాండ్ తో వన్డే సిరీస్ లో ఘోరపరాభవాన్ని చవిచూసింది టీం-ఇండియా. వన్డేల్లో ప్రపంచ ఛాంపియన్లమని చెప్పుకునే ధోని సేని సిరీస్ ను క్లీన్ స్వీప్ తో సమర్పించుకొంది. ఈ నేపథ్యంలో.. కివీస్ తో టెస్ట్ సిరిస్ ను స్టార్ట్ చేయనుంది. నేటి నుంచి న్యూజిలాండ్ తో మొదటి టెస్ట్ మొదలవ్వనుంది. ఈ టెస్ట్ సిరీస్ భారత్ కు బిగ్ టెస్టే మరీ.. ! టెస్ట్ ల్లోనైనా తేరుకొని వన్డేల్లో కలిగిన పరాభవానికి ప్రతికారం తీసుకుంటుందా.. ? లేదా వన్డే తరహా టెస్ట్ లను సమర్పయామి అంటుందా.. ? అనేది చూడాలి. భారత్ జట్టులోకి పుజారా, జహీర్ ఖాన్ వచ్చి చేరారు. కాగా, పచ్చికపై బౌనర్స్ తో బెంబేలెత్తిస్తామని కివీస్ బౌలర్లు సవాల్ విసురుతున్నారు. మొత్తానికి.. టెస్ట్ సిరీస్ అమాంతం రసవత్తరంగా జరగనుంది.