వారి తరపున వాదించం

delhi-gang-repeసామూహిక అత్యాచారానికి పాల్పడి నిర్భయ మృతికి కారణమైన నిందితుల తరపున కోర్టులో వాదించమని ఢిల్లీ న్యాయవాదులు స్పష్టంచేశారు. సాకేత్ జిల్లా కోర్టులో రేపు విచారణ ప్రారంభం కావలసి ఉన్న నేపథ్యంలో ఈ గ్యాంగ్ కేసు న్యాయవాదులేవ్వరు వాదించవద్దని నిర్ణయించుకున్నట్టు సాకేత్ డిస్ట్రిక్ బార్ కౌన్సిల్ సభ్యుడు సంజయ్కుమార్ వెల్లడించారు. తమ కౌన్సిల్లో ఉన్న 2,500 మంది న్యాయవాదులదీ ఇదే నిర్ణయమని సంజయ్ కుమార్ ప్రకటించారు. దీంతో నేరస్తుల తరుపున వాదించడానికి న్యాయవాదులు లేనట్టే.