ఢిల్లీలో మరో గ్యాంగ్ రేప్

delhi-gang-repeదేశ రాజధానిలో ఢిల్లీలో అత్యాచార ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. 23 సంవత్సరాల యువతి సామూహిక అత్యాచార ఘటనను మరవక ముందే మరో దారుణం జరిగింది. దక్షిణ ఢిల్లీ ప్రాంతంలో 17 ఏళ్ల విద్యార్థినిపై ఇద్దరు ఐటీ ఉద్యోగులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. డిసెంబర్ 31 రాత్రి వీరిద్దరూ విద్యార్థినికి మద్యం తాగించి అత్యాచారం చేశారు. నిందితుల్లో ఒకరు బాధితురాలికి ఫేస్ బుక్ ద్వారా తనకు పరిచయం అయ్యాడని బాధితురాలు చెప్పినట్టు సమచారం. న్యూయర్ సెలబ్రేషన్స్ కు తన ప్లాట్ కు ఆహ్వానించి డ్రింక్ లో మత్తుమందు కలిపి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొంది. కాగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, తీహార్ జైలుకు తరలించారు.