ఢిల్లీలో 2.7 అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

cold-delhiదేశ రాజధానిని చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు (శుక్రవారం) ఈ సీజన్ లో అత్యల్ప ఉష్ణోగ్రత 2.7 డిగ్రీలు నమోదైంది. నిన్న 4.4 డిగ్రీలుగా ఉన్న కనిష్ట ఉష్ణోగ్రత అత్యల్ప (2.7) స్థాయికి పడిపోవడంతో భారీగా పొగమంచు పేరుకుపోయి రహదారుల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమాన సర్వీలు ఆలస్యంగా నడుస్తున్నాయి.