ఈడెన్ గార్డెన్ స్టేడియంలో జరిగితున్న రెండో వన్డేలో పాకిస్తాన్ 48.3 ఓవర్లలో 250 పరుగులు చేసి అలౌట్ అయింది. భారత్ విజయలక్ష్యం 251 పరుగులు. పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ లఓ జమ్షెద్ 106, హఫీజ్ 76, యూనిస్ ఖాన్ 10, మాలిక్ 24, ఉమర్గుల్ 17, అజ్మల్ 6, హక్ 2, అజర్ అలీ 2 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా 3, ఇషాంత్ శర్మ ౩, కుమార్, ఆశ్విన్, రైనా తలో ఒక వికెట్ తీసుకున్నారు.