గెలుపు కోసం..

team-indiaటీం-ఇండియా గెలుపు కోసం ఆరాటడుతోంది. న్యూజిలాండ్ గడ్డపై కాలుమోపి నెల అయింది. అయిదు వన్డేలు, ఓ టెస్ట్ ఆడినా విజయం దక్కలేదు. ఇక మిగిలింది ఆఖరి (రెండో) టెస్ట్ మాత్రమే. ఇదైనా విజయంతో ముగించి.. గెలుపు రుచి చూడాలని టీం-ఇండియా పట్టుదలతో వుంది. మరీ.. నెరవేరుతుందో లేదో.. వేచి చూడాలి.

వెల్లింగ్టన్ లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత్ టాస్ గెలిచి ఫీల్డిండ్ ఎంచుకొంది. ప్రస్తుతం కివీస్ 29ఓవర్లలో 71పరుగులు చేసి 4వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం విలియమ్సన్, అండర్ సన్ క్రీజ్ లో వున్నారు. భారత్ బౌలర్లలో ఇషాంత్ శర్మ 3, షమి ఒక వికెట్ తీసుకున్నారు.