ఇండియా బ్రాండ్ ఫస్ట్ ఐ ఫోన్ వచ్చే నెల మార్కెట్లోకి రానుంది. ఫాక్స్కాన్ సంస్థ భారత్ లో ఐఫోన్ల అసెంబ్లింగ్ యూనిట్ ను గతంలో ప్రారంభంచింది. ఈ యూనిట్ నుంచి తొలి ఐ ఫోన్ ఆగష్టు మొదటివారంలో మార్కెట్లోకి రానుంది. భారత్లోనే ఐ ఫోన్లు తయారుకావడంతో ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. అయితే మరికొన్ని వాటికి అనుమతులు రావాల్సి ఉందని.. భారత్లో తయారైన ఐఫోన్-ఎక్స్ ఆర్, ఐఫోన్- ఎక్స్ ఎస్ వచ్చేనెల మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
దీని పై ఇంతవరకు యాపిల్ సంస్థ స్పందించలేదు. ఫాక్స్కాన్ కూడా తమ ఉత్పత్తులపై స్పందించేందుకు నిరాకరించింది. భారత్లో స్థానికంగా తయారయ్యాయి కాబట్టి వీటిపై అధిక స్థాయిలో పన్నులు ఇతర ట్యాక్సులు ఉండవు. యాపిల్ ఐఫోన్లను కొన్ని లక్షల మంది భారతీయులు వినియోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఫోన్ చైనా సంస్థ వన్ ప్లస్ నుంచి అధిక పోటీని ఎదుర్కొంటోంది. భారత్లో తయారైన ఐఫోన్ 6 ఎస్ 7 మోడల్స్ను యూరప్, హాంకాంగ్లకు ఎగుమతి చేస్తోంది.