కరోనా ఎఫెక్ట్ : ఐపీఎల్-13 రద్దు ?

కరోనా ఎఫెక్ట్ తో పండగలు, పబ్బాలు రద్దు చేసుకుంటున్నారు. భారత్ లోనూ కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో సామూహిక సమావేశాలకి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ హోలీ వేడుకలకి దూరంగా ఉండాలని నిర్ణయించారు.

ఇక ఈ నెల 29న ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ పై కరోనా ఎఫెక్ట్ పడేలా ఉంది. త్వరలోనే ఐపీఎల్ నిర్వహణపై క్లారిటీ రానుంది. తాజా పరిస్థితులని బట్టీ చూస్తే మాత్రం ఈ యేడాది ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు, యథావిధిగా ఐపీఎల్ పండుగ ప్రారంభమవుతుందని నిర్వాకులు చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 29 నుంచి మే 24 వరకు ఐపీఎల్ సీజన్ కొనసాగనుంది.