నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనను నిరసిస్తూ జంతర్మంతర్ వద్ద ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అత్యాచార చట్టాలను బలోపేతం చేయడానికి పార్లమెంట్ ను సమావేశపరచాలని బిజెపి నాయకురాలు సుష్మాస్వరాజ్ డిమాండ్ చేశారు. అఖిల పక్షం ఏర్పాటు చేసి ఈ చట్టాలపై చర్చించాలని ఆమె అన్నారు.