సిరీస్ న్యూజిలాండ్ సొంతం

matchభారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన నాలుగో వన్డేలో భారత్ జట్టు పరాజయం పాలయింది. 279 పరుగుల లక్ష్యం బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 48 ఓవర్స్ లో 3 వికెట్ల నష్టానికి లక్ష్యం సాధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇండియా జట్టు ఐదు వికెట్ల నష్టానికి 278 పరుగులు సాధించింది. ప్రారంభంలో తడబడినప్పటికీ… చివర్లో ధోనీ, జడేజాల బ్యాటింగ్ పటిమతో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అయితే బౌలర్స్ వైఫల్యం తో టీం ఇండియా ఓటమిని చవిచూసింది. ఈ ఓటమి తో 3-0 ఆధిక్యం తో న్యూజిలాండ్ జట్టు సీరిస్ ను కైవసం చేసుకుంది. చివరి నామమాత్రపు వన్డే 31 న విల్లింగ్టన్ లో జరగనుంది.