నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న నగరంలో పలుచోట్ల వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. రేపు రాత్రి 10 గంటల నుంచి 1వ తేదీ ఉదయం 2 గంటల వరకు ట్యాంక్బండ్ చుట్టూ వాహనాలను అనుమతించేది లేదన్నారు. రేపు రాత్రి నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు మూసివే యనున్నట్లు సీపీ తెలిపారు. ట్యాంక్బండ్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. రాత్రి 9 గంటల నుంచి వాహనాల రాకపోకలకు అనుమతి లేదు. రేపు అర్ధరాత్రా నుంచి బషీర్బాగ్ ఫ్లైఓవర్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, తెలుగు తల్లి ఫ్లైఓవర్లు మూసివేయనున్నట్లు సీపీ తెలిపారు. ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ హెచ్చరించారు.