స్థానిక సంస్థల ఎన్నికలపై సర్కార్ కు సుప్రీం ఆదేశాలు

supremecourtఆంధ్రప్రదేశ్ రాష్ర్ట స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహణపై దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, బీసీ సంఘం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారణ కు స్వీకరించిన కోర్టు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ, రాష్ర్ట ఎన్నికల సంఘానికి నోటీసులు జారీచేసింది. స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణలో అభ్యంతరాలపై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.