టీమిండియా ఆటగాళ్ల జెర్సీలపై బ్రాండ్ మారనుంది. ఒప్పో బ్రాండ్కు బదులు బైజుస్ కనిపించనుంది. వచ్చేనెల ఆగస్టులో వెస్టిండీస్ పర్యటన వరకే కోహ్లీసేన జెర్సీలపై ఒప్పో బ్రాండ్ కనిపిస్తుంది. ఆ తర్వాత జరగనున్న దక్షిణాఫ్రికా పర్యటన నుంచి బెంగళూరుకు చెందిన ఆన్లైన్ ట్యుటోరియల్ సంస్థ బైజుస్ తన బ్రాండ్ను కొనసాగించనుంది.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో.. 2017 మార్చిలో టీమిండియా స్పాన్సర్షిప్ను రూ.1079 కోట్లకు ఐదేళ్ల పాటు బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడీ సంస్థ ఒప్పందాన్ని రద్దు చేసుకోనుందట. 2017లో అధిక వ్యయానికి ఒప్పందం కుదుర్చుకున్నామనే కారణంతో తప్పుకోవాలని చూస్తోందట. అయితే బైజుస్ సంస్థ అదే కాల వ్యవధికి అంతే మొత్తంలో బీసీసీఐకి చెల్లించడానికి ముందుకు వచ్చిందని, దీంతో సెప్టెంబర్ నుంచి 2022 మార్చి వరకు బైజుస్ స్పాన్సర్షిప్ చేస్తుందని తెలిసింది.
ఇక, విండీస్ టూర్ లో టీమిండియా.. ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటన సెప్టెంబర్ 2న పూర్తవుతుంది. సెప్టెంబర్ 15న దక్షిణాఫ్రికా పర్యటన ప్రారంభం కానుంది.