చిత్తు చిత్తు గా ఓడింది !

cricketచెత్త ప్రదర్శన తో టీం ఇండియా మరో పరాజయాన్ని చవిచూసింది. అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ రెండు విభాగాల్లో వైపల్యం చెంది న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి వన్డేలో చేతులెత్తేసింది. ఐదు వన్డేల సీరిస్ లో ఈ రోజు జరిగిన చివరి వెల్లింగ్టన్ వన్డేలో 87 పరుగుల తేడాతో కివీస్ భారత్ జట్టు పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 5 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. భారత్ ముందు 304 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. 304 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భారత్ 216 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 86 పరుగుల పరాజయాన్ని మూటకట్టుకుంది. సీరిస్ 4-0 తేడా తో కివీస్ జట్టు సొంతం చేసుకుంది. ఐదు వన్డేల సిరీస్ లో భారత్ కనీసం ఒక్క మ్యాచ్ లో కూడా విజయం సాదించలేక కివీస్ చేతిలో చిత్తయ్యింది.