టీమ్ ఇండియా ఓటమి

cricket1మన బ్యాట్స్ మెన్స్ మళ్లీ  చేతులెత్తేశారు. కివీస్ టూర్ లో తొలి విజయాన్ని నమోదు చేసుకొనే చాన్స్ మిస్ చేసుకున్నారు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఛేజింగ్ సాధించి,  రికార్డు సొంతం  చేస్తున్నదనుకున్న  టీం ఇండియా ఫాన్స్ ఆశలపై నీళ్ళు చల్లారు. విజయానికి మరో   40 పరుగు దూరం లో చతికిలపడ్డారు. దీంతో విజయం కివీస్ కు దక్కింది.

న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో.. కివీస్ జట్టు రెండు ఇన్సింగ్స్ లలో కలిపి మొత్తం 608 పరుగులు నమోదు చేయగా.. భారత్ రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 568 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ రెండో ఇన్సింగ్స్ లో శిఖర్ ధావన్ 117, కోహ్లీ 67, ధోనీ 39 పరుగులు చేశారు. చివర్లో గెలుపుకు 40పరుగులు వుండగా టీం ఇండియా అల్ అవుట్ అయ్యింది. దీంతో విజయం కివీస్ కు దక్కింది.