‘వైజాగ్‌ స్టీల్‌’ బ్రాండ్‌ అంబాసిడర్‌ సింధు

sindu

వైజాగ్‌ స్టీల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఒలింపిక్‌ రజత పతక విజేత పీవీ సింధుని నియమించారు. ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంటున్నట్టు స్టీల్ కంపెనీ డైరెక్టర్ ప్రకటించారు. దీనిలో భాగంగా జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో సింధు ధరించే జెర్సీపై వైజాగ్ స్టీల్ లోగో ఉంటుంది.

ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్ మాట్లాడుతూ.. సింధు, వైజాగ్ స్టీల్ రెండూ భారతదేశం యొక్క అమూల్యమైన ఆస్తులని అభివర్ణించారు.

అనంతరం సింధు మాట్లాడుతూ.. తాను ఒప్పందం చేసుకున్న పెద్ద బ్రాండ్లలో ఇది కూడా ఒకటని చెప్పారు. ఇక తన ఆట గురించి ప్రస్తావిస్తూ.. ప్రతి నెలా మూడు ప్రధాన టోర్నీలు జరిగేలా బ్యాడ్మింటన్ క్యాలెండర్ ను మార్చారని… దీని కారణంగా సరైన టోర్నీని సెలెక్ట్ చేసుకుంటేనే ర్యాంకింగ్ మెరుగుపడుతుందని వివరించారు. ప్రస్తుతం సింధు ప్రపంచంలోని తొలి 10 మంది అత్యుత్తమ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల్లో ఒకరుగా వున్నారు.