పట్టుబడ్డ డబ్బు బాలసాయిబాబా ట్రస్ట్ సభ్యుడిది!

ఆటోలోడీజీపీ కార్యాలయం ఎదుట బుధవారం పట్టుబడ్డ రూ. 6.70 కోట్లు డబ్బు కర్నూలు జిల్లా కు చెందిన రామారావుది అని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. రామారావు సీసీఎస్ పోలీసుల ఎదుట పట్టుబడిన డబ్బు తనదేనని గురువారం మధ్యాహ్నం లొంగిపోయారు. రామారావును పలు కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. దోమలగూడ ఆంధ్రా బ్యాంకు నుంచి డ్రా చేసినట్లు, మైసూర్‌లో భూమి కొనుగోలు చేసేందుకు  ఈ డబ్బు తీసుకున్నానని రామారావు పోలీసులకు చెప్పారు. హైదరాబాద్‌ నగరంలోని దోమలగూడలో రామారావు నివాసం ఉంటున్నారు. బాలసాయిబాబా ట్రస్ట్ సభ్యుడిగా పోలీసులు రామారావును గుర్తించారు. డీజీపీ కార్యాలయం ఎదుట రూ. 6.70 కోట్లు నిన్న పట్టుకున్న విషయం తెలిసిందే.