టాటా పవర్ కంపెనీ కొత్త చైర్మన్‌ గా సైరస్‌ మిస్త్రీ

టాటా పవర్ కంపెనీ ప్రైవేటు విద్యుత్ రంగంలో అగ్రగామి సంస్థగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే! కాగా రతన్ టాటా తాజాగా టాటా పవర్ కంపెనీ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. సైరస్‌ మిస్త్రీ రతన్ టాటా స్థానంలో టాటా పవర్ కంపెనీ కొత్త చైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టారు. టాటా పవర్ కంపెనీ ఓ ప్రకటనలో ఈ మార్పు నేటి నుంచే అమల్లోకి వస్తుందని తెలిపింది. రతన్ టాటా బోర్డు సభ్యుడిగా డిసెంబర్ వరకు కొనసాగుతారు. సైరస్‌ మిస్త్రీ టాటా గ్రూపు అధిపతిగా రతన్‌టాటా వారసుడిగా ఇదివరకే ఎంపికైన సంగతి తెలిసిందే.