తెలుగు బిగ్ బాస్ సీజన్ శుభం కార్డు కు చేరుకుంది..మరో రెండు రోజుల్లో సీజన్ 3 విన్నర్ ఎవరో తేలనుంది. ఫైనల్ లో శ్రీ ముఖి , బాబా భాస్కర్ , వరుణ్ , అలీ , రాహుల్ లు ఉన్నారు. కాగా సాధారణ ప్రేక్షకులు తో పాటు సెలబ్రెటీస్ సైతం తమకు నచ్చినవారికి ఓటు వేస్తూ వారి గెలుపుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా లో తమ మద్దతును తెలుపగా..తాజాగా సింగర్ , బిగ్ బాస్ 2 హౌస్ సభ్యురాలు గీత మాధురి తన మద్దతును తెలిపింది.
హౌస్లో టాప్ 5కు చేరుకున్న ఇంటి సభ్యులందరికీ గీతా మాధురి ఆల్ ద బెస్ట్ తెలిపింది. అయితే శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్లతో దిగిన ఫొటోను మాత్రమే పంచుకుంది. అంటే గీతామాధురికి వాళ్లిద్దరిలో ఎవరు టైటిల్ గెలిచినా ఓకే అన్నట్లుగా హింట్ ఇచ్చింది. శ్రీముఖికి సపోర్ట్ గా జబర్దస్త్ యాంకర్ రష్మీ ప్రచారం మొదలుపెట్టారు. రాహుల్కు పాప్ సింగర్ నోయెల్ ప్రచారం చేస్తున్నాడు. అలీ రెజాకు ఓటు వేయాలని పటాస్ యాంకర్ రవి చెప్పడం జరిగింది.