ఫ్లాష్ న్యూస్ 12-07-2018 at 01:00 PM

* బిక్కవోలు మండలం ఊలపల్లి లో ఈరోజు ముగిసిన పాదయాత్ర . రేపు కోర్టుకు హాజరయ్యేందుకు హైదరాబాద్ బయలుదేరిన జగన్, ఇవాళ కేవలం రెండున్నర కిలోమీటర్లకు పరిమితమైన పాదయాత్ర .

* తిరుపతిలో ఎర్ర చందనం స్మగ్లర్ అరెస్ట్ – టీవీ సీరియళ్ళలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్న స్మగ్లర్, స్మగ్లర్ కు టాలీవుడ్ తో సంబంధాలు , ఎర్ర చందనం స్మగ్లింగ్ తో వచ్చిన డబ్బుతో సినిమా లో పెట్టుబడి . ఇటీవల షకలక శంకర్ సినిమాకు ఫైనాన్స్ చేసిన స్మగ్లర్ .

* గోదావరిలో పెరిగిన నీటి ప్రవాహం – ధవళేశ్వరం ఆనకట్ట వద్ద గోదావరి ప్రస్తుత నీటి మట్టం 9 .3 అడుగులు, ధవళేశ్వరం ఆనకట్ట నుండి సముద్రంలోకి 3.30 లక్షల క్యూసెక్కులు విడుదల, పంట కాల్వలకు 4 వేల క్యూసెక్కులు విడుదల .

* రేపు ఉదయం 11 : 30 రాహుల్ తో భేటీ కానున్న మాజీ సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి .