ఫ్లాష్ న్యూస్ 13-07-2018 at 01:30 PM

* విజయవాడ రాజీవ్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో మంత్రి సునీత ఆకస్మిక తనిఖీ – చిన్నారులకు పౌష్టికాహాహం, విద్య అందుతున్న తీరుపై పరిశీలన. కృష్ణానగర్ లో స్వయం ఉపాధి కింద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణి చేసిన మంత్రి సునీత .

* కాంగ్రెస్ లో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి – ఢిల్లీ లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి, కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్ , ఉమెన్ చాందీ , పల్లంరాజు , రఘువీరారెడ్డి .

* కిరణ్ కుమార్ రెడ్డి ఏ.పి ని ఎంతో అభివృద్ధి చేసారు, అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టారు : ఏ.పి కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఉమెన్ చాందీ

* కిరణ్ కుమార్ రెడ్డి ని కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం – భావోద్వేగ పరిస్థితుల మధ్య కిరణ్ కాంగ్రెస్ ని వీడారు, భావోద్వేగాలతో కాంగ్రెస్ కు దూరమైనవాళ్లంతా తిరిగి పార్టీలోకి రావాలి . రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఏ.పి కి న్యాయం . ఏ.పి లో 55 నియోజకవర్గాల్లో స్పెషల్ ప్లాన్ అమలు : ఏపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి

* సోమాజిగూడ కత్రియా హోటల్ కు అమిత్ షా – ఆర్.ఎస్ఎ.స్ నేతలతో భేటీ అయిన అమిత్ షా. మీడియా ప్రతినిధులు వెళ్లిపోవాలని చెప్పిన బీజేపీ నేతలు